Wednesday, December 10, 2008

గాంధేయుల బ్రాందీ వాదము

గాధేయులమా బ్రందేయులమా ?
" నాకు ఒక్కరోజు అధికారమిస్తే ఈ దేశంలో మద్యం లేకుండా చేస్తాను "
అన్నాడు ఆనాడు మహత్ముదు.
మేమంతా గాంధేయులం అంటున్నారు ఈనాడు కొందరు. కాని
ప్రస్తుత పరిస్తితి అందుకు విరుద్ధంగా ఉన్నది.
సాలీన 20 వేల కొట్ల రూపాయల మధ్యం మన రాష్ట్రం లో అమ్ముడవుతున్నది. అందులో 6.5 వేల కొట్లు మాత్రమే ఖజానాకు జమ అవుతున్నది. మిగిలిన 13.5 వేల కొట్లు స్వాహా కాబడుతున్నది.
దీనిని ప్రజా సంక్షేమం అంటున్నారు. ( సంక్షేమమా లేక సంక్షోభమా ? )
విషమిచ్చి చంపితే దానిని హత్య అంటున్నారు. అదే మధ్యమనే విషాన్ని విచ్చలవిడిగా అమ్మితే అది ప్రజసంక్షేమం అంటున్నారు. ఏది నీతి ? ఏది న్యాయం ? ఎవరు సిక్షింపబడాలి ?
ఇంతకూ
ఎవరు గాంధేయ వాదులు ?
సమాజానికి విషాన్ని పంచి కోట్లు గడిస్తున్నవారా ?
విచ్చలవిడిగా మధ్యం అమ్ముకోవడానికి అనుమతించిన వారా ?
కులమతాలను ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టి చిచ్చు పెడుతున్నవారా ?
మారణ హోమం జరుగుతున్నా పదవుల కోసం పోట్లాడుకుంటున్నవారా ?
ఎవరు గాధేయ వాదులు ?
" మద్యం మనిషిని నిర్వీర్యం చేస్తుంది. నిస్సత్తువ కు కారణమవుతుంది. చివరికి మనిషి జీవచ్ఛవం అవుతాడు. " _ మహాత్మా గాంధి
ఈరోజు మద్యం పసిపిల్లలకు కూడ అందుబాటులో ఉంచారు. మద్య నిషేధంలో గుజరాత్ అందరకు ఆదర్శం.
ప్రస్తుత పరిస్తితిపై యువ మైత్రి గొంతు విప్పడానికి సిద్ధమవుతున్నది. త్వరలోనె ఆ వివరలను మీకు అందిస్తాము. మీ సలహాలు సూచనలు తప్పక మేము స్వీకరిస్తాము.
జై భరత్.

యువ మైత్రీ నివేదన

ఆత్మ బంధువులారా !
మన కార్యక్రమాల వివరాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను.
ఇంతవర్కు యువ మైత్రి ని ఆరంభించి సుమరు నాలుగు సంత్సరాల కాలం గడచింది 20 మంది యువకులతో ఆరంభమైన యువ మైత్రి ఈ రోజు జిల్ల వ్యాప్తం గా సుమారు 40 యువజ సంఘాలతో 22 మండలాలలో వాయిస్ యూత్ నెట్ వర్క్ గా రూపాంతరం చెంది పని చేస్తోంది.
సుమారు 400 మంది యువతతో పలు కర్యక్రమాలు చేస్తూ క్రితం సంవత్సరం మాన్యశ్రీ రాష్ట్ర గవర్నర్ వారి చేతులమీదుగ ఉత్తమ సేవ పురస్కారమును అందుకున్నాము అని చెప్పడానికి ఆనందిస్తున్నాము.
అదే విధంగా మా గ్రామ పాఠశాల సుమారు 8 సంవత్సరాల నుండి శిధిలావస్తకు చేరుకున్నా అధికారుల నిర్లక్ష్యానికి గురి కావడం వలన యువ మైత్రి స్పందించి 3 రోజుల నిరాహార దీక్ష ద్వార అధికారులలో స్పందన కలిగించగలిగింది. తద్వార పాఠశాలకు 45 లక్షల రూపాయల గ్రాంట్ ప్రభుత్వం అందించింది .
మహాత్ముని బాటను దేశం మరచిందనే చెప్పాలి . అందుకు గాను గాంధి మార్గాన్ని ఎన్నుకొని యువ మైత్రి యువతలో మహాత్ముని మార్గాన్ని నింపాలని కృషి చేస్తున్నది.
ప్రతి సంవత్సరం ఉత్తమ ఉపధ్యాయులను సత్కరించడము , గ్రామ పారిసుధ్యము నకు కృషి చేయడము ఇటువంటి పలు కార్యక్రమములతో ప్రజా బాహుళ్యం లోనికి యువ మైత్రి దూసుకు పోతున్నది. అంతే కాకుండ సమాజం లోని పలురకాల రుగ్మతలపై పోరాటం కూడ కొనసగిస్తున్నది. మీ సహకారాన్ని మేము ఏ విధముగా అందుకోగలము. మీ సలహాలు సూచనలకు స్వాగతం.
జై భారత్

Monday, December 8, 2008

యువతా మేలుకో

దేశంలో యువత 70 శాతం అంటే 35 సం వత్సరాల లోపు వారు 100కి 70 మంది. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా ఉన్న దేశం భారత దేశం. కాని ఇంకా కడు పేద దేశంగానే మిగిలి ఉంది. ఎందుకంటే యువశక్తి మొత్తం రక రకాల కులాలుగా వర్గాలుగా ప్రాంతీయ తత్వంతో విడిపోవడమే కారణం.
కొంత మంది తమ స్వార్థం కొరకు యువతను విడదీసి, వారి పబ్బం గడుపుకొంటున్నారు అన్నది నిజం. యువత యేకమైతే వారి ఆటలు సాగవన్నది సత్యం. దేశం పేదరికంలో ఆకలి చావులతో నిండి వుండడానికి కారణం యువత అనైక్యతే.
అటువంటి యువతను సమైక్య పరచి వర్గ ప్రాంత విభేదలకు అతీతంగా ఏక త్రాటిపై నడిపించాలనే ఆశయంతో యువమైత్రి ఆరంభిప బడింది.
అనుకున్న ప్రకారం ఆరంభించిన నాటి నుండి యువ మైత్రి నేటి వరకు కొన్నింట విజయాలు సాధించామని తెలియ జేయడానికి ఆనందంగావుంది. ఈ రోజు వైజాగ్ జిల్లా వ్యాప్తంగా " యూత్ వాయస్ నెట్ వర్క్ " పేరుతో కార్య క్రమాలు చేపడుతోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలలో యువ మైత్రిని పెంపొందించి, తద్వారా సామాన్య ప్రజా హితం కొరకు పని చేయడానికి రండి, చేతులు కలపండి.
కలిసి నడుద్దాం. సమైక్య నవ భారతి నిర్మిద్దాం.
జై భారత్.

మైత్రి సంస్థ

ఉపాద్యాయ దినోత్సవం నాడు మైత్రి సంస్థ చేసినగురు పూజ. ఆనాటి చిత్రాలు .

జై భారతమాత

జై భారతమాత నీ సేవ బాగ్యం కలుగజేయుమమ్మా.